మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

 

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 – 1963)

  • పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
  • బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
  • మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
  • 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
  • హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
  • ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
  • తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
  • హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
  • 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
  • అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
  • కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
  • రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.

2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 – 1975)

  • పదవీకాలం: 1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
  • తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
  • అమెరికా ప్రభుత్వం ప్రసాదించే ‘టెంపుల్‌టన్’ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
  • ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  • ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
  • విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
  • విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • 8 దేశాల్లో ‘విజిటింగ్ ప్రొఫెసర్‌’గా పనిచేశారు.
  • ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘ప్రజా దర్బార్‌’ను ఏర్పాటు చేశారు.
  • “Hindu View Of Life”, “All Idealist View Of Life”అనే గ్రంథాలను రచించారు.
  • దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
  • 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
  • ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 – 1969)

  • పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
  • జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
  • కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
  • మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
  • ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
  • అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
  • పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
  • జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో (1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
  • దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.

4. వి.వి. గిరి (1884 – 1980)

  • పదవీకాలం: 1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
  • వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
  • నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
  • అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
  • రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
  • తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
  • కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
  • బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
  • 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
  • ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
  • ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి

5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 – 1977)

  • పదవీకాలం: 1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
  • ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
  • టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
  • ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
  • 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
  • ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని ‘రబ్బర్‌స్టాంప్‌’గా విమర్శకులు పేర్కొన్నారు.
  • ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.

6. నీలం సంజీవ రెడ్డి (1913 – 1996)

  • పదవీకాలం: 1977, జులై 25 నుంచి 1982, జులై 25
  • నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
  • 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
  • ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
  • 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
  • లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
  • ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
  • రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.

7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 – 1994)

  • పదవీకాలం: 1982, జులై 25 నుంచి 1987, జులై 25
  • ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
  • హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
  • మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
  • బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
  • రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై “Pocket Veto”ను వినియోగించారు.
  • వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
  • 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
  • రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
  • ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
  • 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non – Aligned Movements) సదస్సు జరిగింది.

8. ఆర్. వెంకట్రామన్: (1910 – 2009)

  • పదవీకాలం: 1987, జులై 25 నుంచి 1992, జులై 25
  • ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
  • అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
  • కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
  • ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
  • పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
  • 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
  • మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
  • 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.

9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 – 1999)

  • పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
  • ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
  • జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
  • విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
  • ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
  • రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
  • 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
  • దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
  • ‘రాజనీతిజ్ఞ రాష్ట్రపతి’గా పేరుపొందారు.
  • ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.

10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)

  • పదవీకాలం: 1997 జులై 25 నుంచి 2002, జులై 25
  • ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
  • టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • తొలి దళిత రాష్ట్రపతి.
  • పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
  • వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
  • విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
  • ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
  • చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
  • గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
  • లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 – 2015)

  • పదవీకాలం: 2002 జులై 25 నుంచి 2007 జులై 25
  • ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
  • ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
  • భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
  • భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
  • దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
  • వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
  • సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
  • 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
  • 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
  • డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
  • కలాం జన్మదినమైన అక్టోబరు 15న ‘స్టూడెంట్స్ డే’గా నిర్వహిస్తున్నారు.
  • PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
  • కలాం 2015, జులై 27న మరణించారు.

12. ప్రతిభాపాటిల్ (1934)

  • పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
  • ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
  • భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • తొలి మహిళా రాష్ట్రపతి.
  • రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
  • రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  • సుఖోయ్ యుద్ధ విమానం, టీ – 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
  • గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
  • ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
  • బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
  • విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.

13. ప్రణబ్ ముఖర్జీ (1935)

  • పదవీకాలం: 2012 జులై 25 నుంచి – 2017 జూలై 25 వరకు
  • ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా ‘మిరాటి’ గ్రామంలో జన్మించారు.
  • పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1982 – 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
  • 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
  • 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
  • 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
  • 2011లో ‘బెస్ట్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డును అందుకున్నారు.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
  • 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 – 2012 మధ్య వ్యవహరించారు.
  • ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
  • 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
  • లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.

ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు

Advertisement

  • The Dramatic Decade
  • Midterm
  • Off the Track
  • కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.

14. రామ్‌నాథ్ కోవింద్

  • పదవీ కాలం – 2017 జూలై నుంచి..
  • స్వరాష్ర్టం ఉత్తరప్రదేశ్.
  • రాష్ర్టపతిగా ఎన్నికైన రెండో దళితుడు.
  • రాజ్యసభ సభ్యునిగా, బిహార్ గవర్నర్‌గా చేసి రాష్ర్టపతి అయ్యారు.
  • ఈయన 15వ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నికైన 14వ రాష్ర్టపతి.
  • ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన 8వ వ్యక్తి.
  • ఈయన చేతిలో ఓడిపోయినవారు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్.

రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు

  • సుమిత్రాదేవి (1962)
  • మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
  • లక్ష్మీ సెహగల్ (2002)
  • ప్రతిభా పాటిల్ (2007)

తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు

  • వి.వి. గిరి
  • జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
  • బి.డి. జెట్టి

ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు

  • బాబూ రాజేంద్ర ప్రసాద్
  • ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
  • నీలం సంజీవరెడ్డి
  • జ్ఞానీ జైల్‌సింగ్
  • అబ్దుల్ కలాం
  • ప్రతిభా పాటిల్
  • ప్రణబ్ ముఖర్జీ

ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు

  • జి.ఎస్ పాఠక్
  • బి.డి. జెట్టి
  • జస్టిస్ హిదయతుల్లా
  • కె. కృష్ణకాంత్
  • భైరాన్‌సింగ్ షెకావత్

ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు

  • సర్వేపల్లి రాధకృష్ణన్
  • జాకీర్ హుస్సేన్
  • వి.వి. గిరి
  • ఆర్. వెంకట్రామన్
  • శంకర్ దయాళ్‌శర్మ
  • కె.ఆర్. నారాయణన్

భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు

  • సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
  • డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
  • డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
  • వి.వి. గిరి (1975)
  • ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...