105 రాజ్యాంగ సవరణ

 

 

           జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్సభ ఆగస్టు 10 ఆమోదం తెలిపింది

         127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆగస్టు 18 రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 105 రాజ్యాంగ సవరణ జరిగింది. 105 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 338B మరియు 342A సవరించ బడ్డాయి.

         జాతీయ బీసీ కమిషన్విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5 కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342 చెబుతోందని, 102 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...