రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సు జారీచేసే అధికారం

 

          రాజ్యాంగంలోని 123వ అధికరణ ప్రకారం పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్‌'ను జారీ చేస్తారు. పార్లమెంట్ చేసిన శాసనాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆర్డినెన్సులకు కూడా అలాంటి ప్రభావం ఉంటుంది. కాని ఇవి తాత్కాలిక స్వభావం కలిగి ఉంటాయి.

  • కేవలం పార్లమెంట్ ఉభయసభలు సమావేశాలలో లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయాల్సి ఉంటుంది. ఒక సభ మాత్రమే సమావేశంలో ఉండి మరో సభ సమావేశంలో లేనప్పుడు కూడా జారీచేయవచ్చు. ఎందుకంటే ఒక శాసనం తయారు చేయాలంటే రెండు సభల ఆమోదం అవసరం రెండు సభలు సమావేశంలో ఉన్నప్పుడు జారీ చేసిన ఆర్డినెన్సులు చెల్లవు.
  • తప్పనిసరిగా ఆర్డినెన్సులు జారీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపతి సంతృప్తి పడినప్పుడే ఆర్డినెన్సులను జారీ చేస్తాడు. అయితే రాష్ట్రపతి యొక్క సంతృప్తిని దురుద్దేశ్యం కారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూవర్ కేసు (1970)లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేయాలనే ఉద్దేశ్యంతోటే పార్ల మెంట్ లో ఏదేని ఒక సభను లేదా ఉభయసభలను రద్దు చేశాడనే కారణంతో న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. 38వ రాజ్యాంగ సవరణ చట్టం-1975 ప్రకారం రాష్ట్రపతి యొక్క నిర్ణయం న్యాయసమీక్షాధికారం క్రిందికి రాదు. కాని 44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978 ద్వారా దీనిని తొలగించడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చు.
  • రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సులు కేవలం కాలపరిమితుల విషయంలో తప్ప పార్లమెంట్ యొక్క శాసనాలకు సంబంధించిన అన్ని అంశాలతో సమానంగా ఉంటుంది. అంటే
    • పార్లమెంట్ ఏ అంశాలపై శాసనాల చేయగలదో ఆ అంశాలన్నింటిపై రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేయగలడు.
    • పార్లమెంట్ శాసనాలకు వలె అన్ని నియంత్రణలు ఆర్డినెన్సుకు కూడా వర్తిస్తాయి. అంటే ఆర్డినెన్సులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించలేవు
  • పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు జారీ చేసిన ఆర్డినెన్సులు పార్లమెంట్ తిరిగి సమావేశం కాగానే దాని ముందు ఉంచాలి. ఒక వేళ పార్లమెంట్ ఈ ఆర్డినెన్సులను ఆమోదిస్తే అప్పుడది చట్టంగా మారుతుంది. పార్లమెంట్ ఆ ఆర్డినెన్సులు ఆమోదించక పోతే పార్లమెంట్ సమావేశం అయిన 6 వారాలు ముగియ గానే ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. 6 వారాల కంటే ముందే  ఉభయ సభలు తిరస్కరించినా కూడా ఆర్డినెన్స్ రద్దవుతుంది. పార్లమెంట్ ఉభయ సభల వేర్వేరు తేదీలలో సమావేశమవుతే ఆ తేదీల ఆధారంగా 6 వారాలను లెక్కిస్తారు. దీనిని బట్టి ఒక ఆర్డినెన్సు యొక్క గరిష్ట కాలపరిమితి 6 నెలల 6 వారాలు (పార్లమెంట్ ఆమోదించిన సమయాలలో) పార్లమెంట్ ఉభయసభలు ముందు ఆర్డినెన్సును ఉంచకుండానే ఆర్డినెన్సు రద్దయి పోతే ఆ ఆర్డినెన్సు ద్వారా చేయబడిన చర్యలు పూర్తిగా చెల్లబడుతాయి.
  • ఒకసారి జారీ చేసిన ఆర్డినెన్సును రాష్ట్రపతి ఏ సమయంలో అయినా ఉపసంహరించుకోవచ్చు. అయితే ఆర్డినెన్సు జారీచేసే అధికారం రాష్ట్రపతి యొక్క నిరపేక్షాధికారం పై ఆధారపడి ఉండదు. కేవలం ప్రధాన మంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి యొక్క సలహా ఆధారంగానే రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయాలి లేదా ఉపసంహరించుకోవాలి.ఆర్డినెన్సులు కూడా ఇతర పార్లమెంట్ శాసనాల వలే గడిచి పోయిన కాలం నుండి కూడా అమలులోకి వస్తాయి. వీటి వల్ల అప్పటికే అమలులో గల పార్లమెంట్ శాసనాలకు మార్పులు చేయవచ్చు లేదా తొలగించవచ్చు. ఆర్డినెన్సుల ద్వారా పన్ను చట్టాలను కూడా మార్చవచ్చు. కాని రాజ్యాంగాన్ని సవరించేందుకు ఆర్డినెన్సులను జారీచేయవద్దు.
  • రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సు జారీ చేసే అధికారము అనేది 352 ప్రకరణలో పేర్కొన్న జాతీయ అత్యవసర పరిస్థితితో సంబంధం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అంటే యుద్ధం, విదేశీ దురాక్రమణ, అంతర్గత కల్లోలాలు లేని సందర్భంలో కూడా రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సులకు సంబంధించి ఎలాంటి వివాదాల సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లబడలేదు.
  • డి.సి. ఐద్వా కేసు (1987)లో సుప్రీంకోర్టు ఆర్డినెన్సు లోని సమాచారం మార్చకుండా, కనీసం అసెంబ్లీ యొక్క ఆమోదం పొందేందుకు ప్రయత్నించకుండా వరుసగా ఆర్డినెన్సులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఒకే ఆర్డినెన్సును మరలా మరలా జారీ చేయడం చట్ట వ్యతిరేక మని  తీర్పునిచ్చింది. ఆర్డినెన్సుల ద్వారా కార్యనిర్వా హక వర్గానికి ఇవ్వబడ్డ శాసనాధికారం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభ యొక్క శాసనాధికారానికి ప్రత్యామ్నాయంగా ఉండరాదని తెలిపింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...