ఆర్థిక సర్వే 2020-21

  ఆర్థిక సర్వే 2020-21


     కరోనా కారణంగా అల్లకల్లోలమైన ఆర్థిక వ్యవస్థ లాక్‌డౌన్‌ సడలింపులతో క్రమంగా వృద్ధి పథంలో పయనిస్తుంది. ఇలాంటి కల్లోలం శతాబ్దానికి ఒకసారి వస్తుందని, దీని ప్రభావానికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడిపోయాయని ఆర్థ్ధిక సర్వే పేర్కొన్నది. ఆర్థ్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటదని ఆర్థ్ధిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) దేశీయ ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సమావేశంలో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో జనవరి 29న ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాది వార్షిక బడ్జెట్‌కు ముందు ఆర్థిక  సర్వేను లోక్‌సభలో ప్రవేశ పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆర్థిక సర్వేను ప్రధాని ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం రూపొందించింది. కరోనాను నియంత్రణలో ఉంచి మరణాల రేటును తగ్గించి ప్రపంచానికి టీకా అందించామని ఈ ఆర్థిక సర్వే కరోనా వారియర్స్‌కు అంకితమని  పేర్కొన్నారు. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితులను వివరించారు.

     లాక్‌డౌన్‌, ఇతర కారణాలతో 2020-21 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. తొలి వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతానికి పడిపోయింది. జూలై నుంచి పరిస్థితులు మెరుగుపడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ జీడీపీ 7.7% క్షీణించనుంది. కానీ తిరోగమనంలో కూడా ఆశావీచికలు కనిపిస్తున్నాయి. గతంలో 1979-80 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మైనస్‌ 5.2% క్షీణతను చూపించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో  షేప్‌ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని సర్వే పేర్కొంది. 2021-22లో దేశీయ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 11 శాతం వృద్ధి రేటు నమోదవుతదని ఆర్థిక సర్వే పేర్కొంది. నామినల్‌ జీడీపీ 15.4 శాతం ఉంటుందని తెలిపింది.  


.

.

ముఖ్యాంశాలు

     శతాబ్దానికి ఒకసారి ఎదురయ్యే కరోనా లాంటి సంక్షోభ సమయంలో దేశ ఆర్థికస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ పరిస్థితిని వందేండ్లకోసారి వచ్చే సంక్షోభమని సర్వే వివరించింది.  

 

వ్యవసాయం తప్ప అన్ని రంగాల్లో వైఫల్యం

     మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ వినియోగం పెరగాలి. ఇవి ఎగుమతుల వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020-21 ద్వితీయార్థంలో ఎగుమతులు 5.8 శాతం, దిగుమతులు 11.3 శాతం తగ్గొచ్చని అంచనా వేసింది.  

 

అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్లు 

     17 ఏండ్ల విరామం తరవాత వర్తమాన ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో 3.1 శాతం కరెంట్‌ ఖాతా మిగులు నమోదైంది. 2020-21లో కరెంట్‌ ఖాతాలో 2 శాతం మిగులు, జీడీపీలో 2 శాతానికి చేరవచ్చు. రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30 వేల కోట్లు రానున్నాయి. కొద్ది నెలలుగా విద్యుత్‌ వినియోగం, రైల్వే రవాణా, ఈ-వేబిల్స్‌, జీఎస్టీ వసూళ్లు, ఉక్కు వినియోగం తారాస్థాయికి చేరుకున్నాయి. వీటిని బట్టి చూస్తుంటే రెండంకెల వృద్ధిరేటు పెరగవచ్చని తెలుస్తుంది.  

     2014-15లో ప్రతి రోజు 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018-19 నాటికి 30 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. 2020-21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా 22 కిలోమీటర్లకు పడిపోయింది. విదేశీ పెట్టుబడులకు భారత్‌ ఇప్పటికి స్వర్గధామం. 2020 నవంబర్‌లో విదేశీ పెట్టుబడులు రికార్డ్‌ స్థాయిలో 9.8 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను భారతదేశం మాత్రమే ఆకర్షించింది. 2019 జూలై నుంచి 2020 అక్టోబర్‌ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగరమాల ప్రాజెక్టులను పూర్తిచేసింది. 

     9-12 తరగతులకు దశలవారీగా ఒకేషనల్‌ కోర్సులు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం.. ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన (పీఎంజేఏవై)ను అమలు చేస్తున్న రాష్ర్టాలు, అమలు చేయని రాష్ర్టాలతో పోల్చితే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి శిశు మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతుంది. దేశ సార్వభౌమ రుణపరపతి రేటింగ్‌ విషయంలో విదేశీ రేటింగ్‌ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ కారణంగా 37 లక్షల కేసులు తగ్గించగలిగాం. లక్ష ప్రాణాలు కాపాడగలిగామని సర్వే పేర్కొన్నది. 500 కేసులు కూడా నమోదు కాకుండానే లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిదేశం భారతదేశమని పేర్కొన్నది.

 

నూతన వ్యవసాయచట్టం

     కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఆర్థిక సర్వే సమర్థించింది. ఈ చట్టాల వల్ల దీర్ఘకాలంలో చిన్నతరహా, మధ్యతరహా రైతులకు ఆదాయాలు పెరగడంతో పాటు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉండటం వల్ల తమ పంటలకు అధిక ధర పొందవచ్చని తెలిపింది.  

 

ప్రధాన రంగాలు

వ్యవసాయం: కరోనా సంక్షోభంలో వ్యవసాయ వృద్ధి రేటు 3.4 శాతం నమోదైంది. వ్యవసాయం అనుబంధ రంగాల దేశ గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) ప్రస్తుతం 17.8 శాతంగా ఉంది. జీవీఏకి సంబంధించిన గ్రాస్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీసీఎఫ్‌)  2013-14లో 17.7 శాతం నుంచి 2018-19 నాటికి 16.4 శాతానికి చేరింది. అయితే 2015-16 నాటికి 14.7 శాతానికి తగ్గింది. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. 5.5 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం వర్తించింది. డిసెంబర్‌ 2020 నాటికి పీఎం కిసాన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమచేశారు. ఇటీవల కేంద్రప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టం మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్యతరహా రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని సర్వే పేర్కొన్నది.  

సామాజిక సేవారంగాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవారంగంలో ఉమ్మడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.17.16 లక్షల కోట్లు వ్యయం చేశాయి. గతేడాదితో పోల్చితే 12 శాతం అదనంగా పెరిగింది. విద్య, క్రీడలు, కళలు, సంస్కృతి, వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కార్మిక సంక్షేమ రంగాలు ఇందులో ఉన్నాయి. పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాచుర్యం పెరిగింది. ప్రైవేట్‌ సెక్టార్‌లోనూ వర్క్‌ ఫ్రం హోం విధానం జోరందుకుంది.   

పీఎంజేఏవై: 2018లో ప్రారంభించిన ప్రధానమంత్రి జనారోగ్య యోజన (పీఎంజేఏవై) స్వల్పకాలంలోనే వైద్యరంగంలో సానుకూల ఫలితాలను తెచ్చింది. దీనికింద రూ.10.74 కోట్ల పేద ఆవాసాల్లోని 50 కోట్ల మందికి లాభం చేకూరింది. ఈ పథకం 32 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉన్నది. ఈ పథకం అమలుపరిచిన రాష్ర్టాల్లో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

ఆరోగ్య సంరక్షణ: జాతీయ ఆరోగ్య విధానం కింద ఈ రంగంపై పెట్టుబడులు జీడీపీలో 1 శాతం నుంచి 2.5-3 శాతానికి పెంచడం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఆరోగ్య సౌకర్యాల అందుబాటులో మన దేశం ప్రపంచంలో 145వ స్థానం (మొత్తం 180 దేశాలకుగాను) భవిష్యత్తులో రానున్న ప్రాణాంతక మహమ్మారులను సమర్థవంతంగా నిలువరించే స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు ఉండాలి. 

.

.

జీడీపీ వృద్ధిరేటు  

స్థిరమైన ధరలు (శాతంలో)

2017-18    7.0

2018-19        6.1

2019-20        4.2

2020-21      7.7

2021-22        11.0 (అంచనా)

 

పారిశ్రామిక వృద్ధి రేటు 

ప్రాథమిక ధరల వద్ద జీవీఏ వృద్ధిరేటు 

(శాతంలో)

2017-18        6.3

2018-19        4.9

2019-20        0.9

2020-21      9.6

 

వ్యవసాయం, అనుబంధరంగాలు 

ప్రాథమిక ధరల వద్ద జీవీఏ వృద్ధిరేటు 

(శాతంలో)

2017-18        5.9

2018-19 2.4

2019-20        4.0 

 

 సేవారంగం వాటా 

2020-21      3.4 (అంచనా)

 

ద్రవ్యలోటు (జీడీపీలో శాతం)

2017-18 3.5

2018-19        3.4

2019-20        4.6

2020-21 3.5

 

కరెంట్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ 

(జీడీపీలో శాతం)

2017-18      1.8

2018-19        2.1

2019-20        0.9

2020-21        3.1

 

ఫారెన్‌ ఎక్చ్సేంజ్‌ రిజర్వ్‌లు (డాలర్లలో) ఏడాది చివరికి

2017-18      424.4

2018-19      411.9

2019-20      475.6

2020-21      586.1

.

.

     లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అప్పులు తెచ్చి ప్రజలను ఆదుకున్నాయి. పేదలకు ఉచితంగా రేషన్‌ అందించడం, ఖర్చుల కోసం ఖాతాల్లో డబ్బు జమ చేయడం, కూలీలను వారి స్వస్థలాలకు పంపించడం, కంపెనీలకు ఉద్దీపన ప్యాకేజీలు అందించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల అప్పులు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాల అప్పులు వాటి జీడీపీ పరిశీలిస్తే నాలుగు రెట్లకు పైగా ఉన్నాయి. భారత్‌లో జీడీపీ కన్నా అప్పులు కాస్త తక్కువగా ఉన్నాయి. 

 

దేశ జీడీపీలో అప్పుల వాటా శాతం

జపాన్‌            444.7

కెనడా              356.1

ఫ్రాన్స్‌              351.4

అమెరికా            318.7

బ్రిటన్‌              310.8

జర్మనీ              215.8

భారత్‌              122.9    

 

ప్రధాన రంగాలు

     మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం కోసం టెలిమెడిసన్‌ విధానాన్ని మరింత బలోపతం చేయాలని సర్వే సూచించింది. 

పీడీఎస్‌ ఆహార ధాన్యాల రేటు పెంచాలి: జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా అత్యధిక సబ్సిడీ ధరలకే బియ్యం (కిలో రూ.3), గోధుమలు (కిలో రూ.2), కాయధాన్యాలు (కిలో రూ.1) ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇందుకు ఆహారధాన్యాల ధరను సవరించాలి. పీడీఎస్‌ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020-21 వార్షిక బడ్జెట్‌లో కేంద్రం రూ.1,15,569 కోట్లు కేటాయించడం గమనార్హం.

ఆన్‌లైన్‌ విద్యకు ఊతం: కరోనా వల్ల గతేడాది నుంచి పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గత రెండేండ్లలో 36 నుంచి 61 శాతానికి పెరిగింది. 

దివాలా చట్టం: దివాలా చట్టం అమల్లోకి తెచ్చి బ్యాంకుల రుణగ్రహీతల బంధాన్ని పునర్‌నిర్మించింది. 2020 డిసెంబర్‌ నాటికి పరిష్కార ప్రక్రియ ద్వారా 308 మంది కార్పొరేట్‌ రుణగ్రహీతలు దివాలాకు వెళ్లకుండా కాపాడటం జరిగింది. వారి రుణ బకాయిల విలువ రూ.4.99 లక్షల కోట్లు. ఈ చట్టం కింద చర్యలతో బ్యాంకులు రూ.1.99 లక్షల కోట్ల రుణాలు వసూలు చేయగలిగింది. 

నవ్య ఆవిష్కరణలో 48వ స్థానం: నూతన ఆవిష్కరణ సూచీలో భారత్‌కు 48వ స్థానం దక్కింది. 2015లో 81వ ర్యాంకులో ఉంది. ప్రైవేటు రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలి.

బ్రాడ్‌ బ్యాండ్‌ విస్తరణతో తగ్గిన చార్జీలు: ఇంటర్నెట్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ విస్తరణతో చార్జీలు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వినియోగదారుడి వైర్‌లెస్‌ డాటా వినియోగం 2019 మార్చిలో సగటున 9.1 జీబీ ఉండగా, 2020 జూన్‌లో అది 12.2 జీబీకి పెరిగింది. 





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...