2021 భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

 

           2021 సంవత్సరానికిగానూ..భౌతిక శాస్త్రం(Nobel Prize in Physics 2021)లో ముగ్గురిని నోబెల్‌ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో(Syukuro Manabe), క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ 05.10.2021 ప్రకటించింది.

 


  • సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై పరిశోధనలకు గానూ వీరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 
  • ఇందులో జార్జియో పారిసీ(Giorgio Parisi)కి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌(Klaus Hasselmann) పంచుకోనున్నారు. 
  • ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు.
  • డిసెంబరు 10 అందజేస్తారు

2021 వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌

 

           వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్‌ పరిశోధకులను నోబెల్‌ బహుమతి వరించింది. డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్‌, డా. అర్డెమ్‌ పటాపౌటియన్‌లుకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరు ఎంపికయ్యారు. 

 

           ‘మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి’ అని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది. రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం.. కానీ, ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది.

  • డేవిడ్‌ జూలియస్‌(David Julius) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
  • అర్డెమ్‌ పటాపౌటియన్‌ కూడా కాలిఫోర్నియాలోని స్క్రిస్స్‌ రీసెర్చ్‌లో కేంద్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 
  • ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు.
  • డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రధానం చేస్తారు.



SEP 21 YOJANA TM

టోక్యో ఒలింపిక్స్ - 48వ స్థానంలో భారత్...

         కరోనా సహా అన్ని అవరోధాలను అధిగమించి 2021, జూలై 23 ప్రారంభమైన విశ్వ క్రీడలు 2021, ఆగస్టు 8 ఘనంగా ముగిశాయి.


         టోక్యోలో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్ 48 స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్కు 33 స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్ను పరిగణనలోకి తీసుకుంటారు.

.

.

 

 

స్వర్ణం - 1

·        జావెలిన్త్రోలో నీరజ్చోప్రా

రజతం - 2

·   మహిళల వెయిట్లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను

·        పురుషుల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రవి దహియా

కాంస్యం

·        మహిళల బ్యాడ్మింటన్సింగిల్స్లో పీవీ సింధు

·        మహిళల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్

·        పురుషుల రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో బజరంగ్పూనియా

·        పురుషుల హాకీ జట్టు

 


పారిస్లో 2024 ఒలింపిక్స్...

        మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్ రానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్ కేంద్రం పారిస్లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు నగరం ఒలింపిక్స్కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది.



105 రాజ్యాంగ సవరణ

 

 

           జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్సభ ఆగస్టు 10 ఆమోదం తెలిపింది

         127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆగస్టు 18 రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 105 రాజ్యాంగ సవరణ జరిగింది. 105 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 338B మరియు 342A సవరించ బడ్డాయి.

.

.

         జాతీయ బీసీ కమిషన్విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5 కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342 చెబుతోందని, 102 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది.

 

అసిటబులేరియా జ‌ల‌క‌న్య‌కే

 

              భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వృక్ష జాతి మొక్క‌ను కనుగొన్నారు. అండ‌మాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. 2019లో ఆ దీవుల‌కు వెళ్లిన వృక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ఆ మొక్క ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ మెరైన్ గ్రీన్ ఆల్గేకు జ‌ల‌క‌న్య (మెర‌మైడ్) అని పేరు పెట్టారు. తాము క‌నుగొన్న మొక్క కొత్త‌ది అని చెప్పేందుకు వాళ్ల‌కు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని క‌నుగొన‌డం గ‌త నాలుగు ద‌శాబ్ధాల్లో ఇదే మొద‌టిద‌న్నారు.

 .

.

             పంజాబ్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఆ మొక్క‌కు అసిటబులేరియా జ‌ల‌క‌న్య‌కే అన్న శాస్త్రీయ నామాన్ని పెట్టారు. జ‌ల‌క‌న్య అంటే స‌ముద్ర దేవ‌త‌. కొత్త‌గా గుర్తించిన మొక్క చాలా అద్భుతంగా ఉంద‌ని, చాలా సున్నిత‌మైన డిజైన్‌లో ఆ మొక్క ఉంద‌ని, ఛ‌త్రీల త‌ర‌హాలో ఆ జ‌ల‌క‌న్య క‌నిపిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ ఫెక్లీ బ‌స్త్ తెలిపారు. జ‌ల‌క‌న్య మొక్క ఒకేఒక్క భారీ క‌ణంతో త‌యారైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

 

 

 

ప్రాథమిక హక్కులు - 1

Indian Polity Quiz

ప్రాథమిక హక్కులు - 1


  • Total number of questions : 10.
  • Each question carry 1 mark, no negative marks.
  • All the best :-).
  • Progress:


    Info:

    Answered

    Unanswered

    During the exam to go for previous and next questions click on And
    Error! You have not answered all of the questions!

    Question:

    {{quiz.activeQuestion+1 + ". " + quiz.dataService.quizQuestions[quiz.activeQuestion].text}}

    {{answer.answer}}

    Are you sure you want to submit your answers?


    Congratulations You Scored

    {{results.quizMetrics.numCorrect}} / {{results.dataService.quizQuestions.length}}

    Total number correct answers:-

    {{results.quizMetrics.numCorrect}}

    Total number of questions:-

    {{results.dataService.quizQuestions.length}}

    {{results.calculatePerc() | number:2}}%


    Questions:

    {{results.activeQuestion+1 +". "+results.dataService.quizQuestions[results.activeQuestion].text}}

    {{answer.answer}}

    Your Answer

    Correct Answer


    Note:-Click On And To check your answer and actual answer

    Results:



    Explanation

    1. అల్ప సంఖ్యాక వర్గాల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
    (a) సమానత్వ హక్కు
    (b) పీడనాన్ని నిరోధించే హక్కు
    (c) మత స్వాతంత్య్ర హక్కు
    (d) విద్య, సాంస్కృతిక హక్కు
    Ans: (d)

    2. కిందివాటిలో సరికానిది ఏది?
    (a) అంటరానితనం నిషేధం: అధికరణ - 17
    (b) వెట్టిచాకిరి నిషేధం: అధికరణ - 23
    (c) బలవంతంగా మతమార్పిడి నిషేధం: అధికరణ -29
    (d) బాలకార్మికుల వ్యవస్థ నిషేధం: అధికరణ - 24
    Ans: (c)

    3. హెబియస్ కార్పస్ అనేది ఏ భాషా పదం?
    (a) లాటిన్
    (b) గ్రీకు
    (c) రోమన్
    (d) ఇంగ్లిష్
    Ans: (a)

    4. స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు?
    (a) బాల గంగాధర తిలక్
    (b) రాజా రామ్మోహన్ రాయ్
    (c) మానవేంద్రనాథ్ రామ్
    (d) దాదాబాయ్ నౌరోజీ
    Ans: (a)

    5. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
    (a) జవహర్‌లాల్ నెహ్రూ
    (b) సర్దార్ వల్లభాయ్ పటేల్
    (c) రాజేంద్రప్రసాద్
    (d) జె.బి.కృపలాని
    Ans: (b)

    6. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
    (a) రష్యా
    (b) అమెరికా
    (c) బ్రిటన్
    (d) జపాన్
    Ans: (b)

    7. ప్రాథమిక హక్కుల్లో ఏయే అధికరణల్లోని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి?
    (a) అధికరణ-14, 17, 19, 20
    (b) అధికరణ-14, 17, 21, 24
    (c) అధికరణ-17, 20, 22, 26
    (d) అధికరణ-20, 21, 31, 32
    Ans: (b)

    8. జాతీయ అత్యవసర కాలంలో రద్దు కాని అధికరణలు ఏవి?
    (a) 25, 26
    (b) 20, 21
    (c) 19, 20
    (d) 17, 18
    Ans: (b)

    9. అధికరణ-19లో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు?
    (a) పత్రికా స్వేచ్ఛ
    (b) భావ ప్రకటన స్వేచ్ఛ
    (c) స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ
    (d) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ
    Ans: (d)

    10. కింది వాటిలో సాంప్రదాయిక హక్కు ఏది?
    (a) స్వేచ్ఛ స్వాతంత్య్ర హక్కు
    (b) మత స్వాతంత్య్ర హక్కు
    (c) పీడనాన్ని నిరోధించే హక్కు
    (d) విద్యా, సాంస్కృతిక హక్కు
    Ans: (a)



    SHINE INDIA JUNE 21 CURRENT AFFAIRS MAGAZINE




     

    DOWNLOAD JUN 21








    SHINE INDIA MAY 21 CURRENT AFFAIRS MAGAZINE




     

    DOWNLOAD MAY 21









    SHINE INDIA APRIL 21 CURRENT AFFAIRS MAGAZINE




     

    DOWNLOAD APR 21








    SHINE INDIA MARCH 21 CURRENT AFFAIRS MAGAZINE

     

    DOWNLOAD MAR 21












    SHINE INDIA FEB 21 CURRENT AFFAIRS MAGAZINE

     

    DOWNLOAD FEB 21














    SHINE INDIA JANUARY 21 CURRENT AFFAIRS MAGAZINE

     

    DOWNLOAD JAN 21










    జాతీయాదాయ వృద్ధిరేటు

       ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
             ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం (Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income) అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

    GNP=GDP + విదేశీ ఆదాయం

        అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 
    ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు.

    లభించే మార్గాలు
    ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది.
    ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.  
    ప్రజల వినియోగం(Consumpion): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.
    పెట్టుబడి వ్యయం(Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.
    ప్రభుత్వ వ్యయం(Governament ependiture): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది.
    విదేశీ ఆర్థిక వ్యవహారాలు(foreign economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 
            ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.
    GNP= C + I + G + (X - M) + (R - P)
    C = వినియోగం,  I  = పెట్టుబడులు,
    G = ప్రభుత్వ వ్యయం
    X - M = విదేశీ వ్యాపార శేషం, 
    R - P = విదేశీ చెల్లింపుల శేషం
    లెక్కింపు 
       జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
        జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
       1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
        2) వాటి ధరల్లో మార్పు
        ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
        మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 2019-20 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
    2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
        ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది.
        2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.
        నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.
    మార్పులు - గణన
    జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.
    ఆధార సంవత్సర ధరల్లో.. 
    (GNP at base year or constant priece)

        ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. 
        సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.
     
        డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి (దిశిఖి) ధరల స్థాయిని తెలియజేస్తుంది.

    ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం(GNP at current prices)
        ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

        పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు.

    Related Posts Plugin for WordPress, Blogger...