కరుణానిధి - తమిళుల్లో ఎందుకింత ఉద్వేగం? ఎక్కడిదీ అభిమానం?


ఈనాడు ప్ర‌త్యేక క‌థ‌నం


 

ద్రవిడ సూర్యుడు మేరునగధీరుడు
14 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి
1967లో మంత్రిగా..1969లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం
ఐదుసార్లు సీఎంగా బాధ్యతలు
పలు రికార్డులు నెలకొల్పిన కరుణ
అపర చాణక్యుడిగా ఖ్యాతి
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా... వివాహ వేడుకలో పెళ్లికొడుకు వంటివాడు కరుణానిధి!
- ప్రముఖ కవి, కరుణానిధి సహచరుడు కన్నమదాసు ఒక సందర్భంలో కరుణానిధి గురించి చెప్పిన మాట ఇది. దీన్ని తమిళనాడు రాజకీయాలకు, ద్రవిడ ఉద్యమానికి అన్వయించుకుంటే కరుణానిధి గొప్పతనం తెలుస్తుంది. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కుల రహిత, అంటరానితనం లేని, హేతుబద్ధ సమాజం కోసం యాభై ఏళ్ల క్రితం తమిళనాడులో ఎలుగెత్తిన ప్రజా చైతన్యమే ద్రవిడ ఉద్యమం. దీన్ని ప్రారంభించింది జస్టిస్‌ పార్టీ, ద్రవిడార్‌ కజగమ్‌ నేతలైన టీఎం నాయర్‌, త్యాగరాయ చెట్టి, పెరియార్‌ రామస్వామి అయితే విస్తృతంగా  ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఘనత కరుణానిధికి దక్కుతుంది.    ద్రవిడ ఉద్యమానికి తొమ్మిది పదుల వయస్సులోనూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారాయన.
కరుణానిధికి పెద్దగా చదువు లేదు. కానీ ఆయనలో అద్భుతమైన రచయిత ఉన్నాడు. మాటల్లో దృశ్యాన్ని ఆవిష్కరించగలరు. ఆ కళే చిత్రపరిశ్రమకు దగ్గర చేసింది. అద్భుతమైన  స్క్రీన్‌ప్లే రచయితగా పేరు తెచ్చుకున్నారు. తన హేతువాద భావాలను బలంగా పలికించటం ద్వారా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. రాజకీయాల పట్ల చిన్నతనం నుంచి ఆయనకు ఆసక్తి ఉండేది.
జస్టిస్‌ పార్టీ నుంచి ద్రవిడార్‌ కజగమ్‌ వరకూ...
జస్టిస్‌ పార్టీని 1917లో టీఎం నాయర్‌, పి. త్యాగరాయ చెట్టి ప్రారంభించారు. బ్రాహ్మణ వాదానికి  వ్యతిరేకంగా, సమాజంలో అందరూ సమానమే అనే భావన దీనికి పునాది. 1937లో పెరియార్‌ రామస్వామి జస్టిస్‌ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవిడ ఉద్యమం జోరందుకుంది. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించటానికి పెరియార్‌ రామస్వామి, ద్రవిడార్‌ కజగమ్‌ను ఏర్పాటు చేశారు. దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించటం, పురోహితులు సంస్కృతంలో కాకుండా, తమిళంలో శ్లోకాలు చదవటం, హిందీ వ్యతిరేక ఉద్యమం... తదితర కార్యక్రమాలు తమిళనాడును ఉర్రూతలూగించాయి. కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన పెరియార్‌కు లేదు. ఆయన అనుచరులు కొందరు ఎన్నికల్లో పోటీచేసినా, రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ఒత్తిడి చేసినా పెరియార్‌ ఒప్పుకోలేదు. దానివల్ల ద్రవిడ ఉద్యమం బలహీనపడుతుందని ఆందోళన చెందారు. కానీ ఆయన అనుచరులు విడిపోయి 1949లో సిఎన్‌ అన్నాదురై సారధ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగమ్‌ (డీఎంకే)ను స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో  కీలకమైన అధ్యాయానికి అదే శ్రీకారం.
బాల్యంలోనే బావుటా
14 ఏళ్లు
కరుణానిధి పాఠశాల స్థాయినుంచే నాటకం, కవిత్వంపై ఆసక్తి చూపించారు. అప్పట్లో జస్టిస్‌ పార్టీనేత అళగిరిస్వామి నుంచి స్ఫూర్తి పొంది 14 ఏళ్ల వయస్సులోనే ఆ పార్టీలో చేరి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1937లో ప్రభుత్వ పాఠశాలల్లో హిందీని అప్పటి రాజాజీ ప్రభుత్వం తప్పనిసరి చేయగా, దానిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షమైన జస్టిస్‌ పార్టీ ఉద్యమించింది. బాల్యంలోనే పాఠశాల మిత్రులతో కలిసి ‘ఇళైజ్ఞర్‌ మరుమలర్చి అమైప్పు’ అనే ఉద్యమాన్ని కరుణానిధి ప్రారంభించారు. హిందీ వ్యతిరేక ర్యాలీలోనూ పాల్గొన్నారు. విద్యార్థులను సంఘటితపరిచేందుకు పిన్న వయసులోనే ‘మాణవ నేసన్‌’ అనే చేతిరాత కరపత్రికను నడిపించారు. ఇదే తమిళనాడులో పురుడుపోసుకున్న తొలి విద్యార్థుల ఉద్యమం. కరుణానిధి, ఆయన మిత్రులు పూరిగుడిసెలకు సైతం వెళ్లి సామాజిక చైతన్యానికి కృషి చేశారు. 17 ఏళ్లు
17 ఏళ్లకు కరుణానిధి తమిళనాడు విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తర భారతం నుంచి వచ్చిన వ్యాపారులు కల్లగుడిలో దాల్మియా సిమెంట్‌ ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని దాల్మియాపురంగా మార్చారు. దీని పేరును కల్లకూడిగా మార్చాలంటూ కరుణానిధి నేతృత్వంలో తొలి పోరాటం సాగింది. ఇందులో ఇద్దరు పోలీసులు మృతిచెందడంతో కరుణానిధి అరెస్టయ్యారు.
కరుణ శకం 33 ఏళ్లు
కరుణానిధికి 33 ఏళ్ల వయస్సులో డీఎంకే పార్టీ నుంచి 1957లో కుళితలైను శాసనసభ్యుడిగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించి ఓటమి ఎరుగుని నేతగా రికార్డు సృష్టించారు. 1961 నాటికి డీఎంకే కోశాధికారిగా, ఆ తర్వాత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. 1967లో డీఎంకే అధికారంలోకి రాగా, కరుణానిధి ప్రజాపనుల శాఖ మంత్రి అయ్యారు. అన్నాదొరై 1969లో చనిపోవటంతో కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. తమిళ భాషకు అగ్రప్రాధాన్యం, పేదలకు సబ్సిడీపై బియ్యం పంపిణీ... వంటి విప్లవాత్మకమైన పధకాలకు శ్రీకారం చుట్టటం ఆయన హయాంలో జరిగాయి. 1971లో డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించింది. కరుణానిధి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్ది కాలానికే కరుణానిధితో ఏర్పడిన విభేదాలు కారణంగా డీఎంకే నుంచి ఎంజీఆర్‌ బయటకు వచ్చేసి 1972లో అన్నాడీఎంకేను ప్రారంభించారు. తమిళరాజకీయాల్లో ఇది మరో అధ్యాయానికి ఆరంభం అయ్యింది. నిజానికి తొలినాళ్లలో కరుణానిధి, ఎంజీఆర్‌ల స్నేహం, ఆతర్వాత  తలెత్తిన రాజకీయ వైరుధ్యం.. రెండూ తమిళ రాజకీయాలను కీలక మలుపులు తిప్పినవే!
భిన్న ధ్రువాలు.. ఎంజీఆర్‌, కరుణ
కరుణానిధి, ఎంజీఆర్‌లు విభిన్న ధ్రువాలుగా..రాజకీయ తెరపై ప్రత్యర్థులుగా అందరూ భావిస్తారు. నిజానికి వారిద్దరూ ఒకే పార్టీలో కలిసి నడిచిన వ్యక్తులే. మొదట కాంగ్రెస్‌లో చేరిన ఎంజీఆర్‌ తర్వాత అన్నాదురై ప్రసంగాలకు ఆకర్షితుడై డీఎంకేలో చేరారు. పార్టీ నిధుల కోసం ఎంజీఆర్‌ తన నాటక కంపెనీ తరఫున నాటకాలు ప్రదర్శించారు. అప్పుడే ఎంజీఆర్‌, కరుణానిధి మధ్య స్నేహం బలపడింది. అన్నాదురైకు వీరిద్దరు కుడి, ఎడమ భుజాలుగా ఉండేవారు. అందుకే ఇద్దరూ వేదికపై ఉండగా ‘వీరిద్దరూ నా తమ్ముళ్లు’ అంటూ తరచూ అన్నాదురై చెప్పేవారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి డీఎంకే అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంలోనూ ఎంజీఆర్‌ కీలక పాత్ర పోషించారు. తర్వాత కొద్ది కాలానికే వారిమధ్య విభేదాలు తలెత్తాయి. 1971 ఎన్నికల్లో కోశాధికారిగా ఉన్న తనకు తెలియకుండా అభ్యర్థులకు అధిష్ఠానం డబ్బులు పంపిణీ చేశారన్న కారణంతో ఎంజీఆర్‌ మనస్తాపానికి గురయ్యారు. ఆ పరిణామం తర్వాత ఇద్దరి మధ్య దూరం పెంచింది. 1972 అక్టోబరు 8న తిరుకళుకుండ్రం, ట్రిప్లికేన్‌లో జరిగిన డీఎంకే బహిరంగ సభల్లో ఎంజీఆర్‌ మాట్లాడుతూ...‘డీఎంకే అధ్యక్షుడి నుంచి కార్యదర్శుల వరకు తమతమ వ్యక్తిగత ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ’ పిలుపునిచ్చారు. ఇది జరిగిన రెండో రోజే ఎలాంటి వివరణ కోరకుండానే ఎంజీఆర్‌ను పార్టీ నుంచి కరుణానిధి తొలగించారు. తర్వాత ఎంజీఆర్‌ అన్నాడీఎంకేను స్థాపించారు. రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు కొనసాగుతూ వస్తోంది. ఎంజీఆర్‌ సినీ ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం కరుణానిధి తన తనయుడు ముత్తును సినీ హీరో చేశారనే ప్రచారమూ ఉంది. కాంగ్రెస్‌ను ఎదుర్కొన్న ఒకే ఒక్కడు!
డీఎంకే తొలిసారిగా 1957లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు పోటీ చేసేందుకు తన సొంత జిల్లా తంజావూరులో కరుణానిధికి నియోజకవర్గం లభించలేదు. చివరికి కుళితలైను కేటాయించారు. అప్పట్లో ఆ నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో మాత్రమే డీఎంకేకు శాఖలు ఉండేవి. కరుణానిధి రోజూ తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. పార్టీ కిందిస్థాయి వ్యవస్థను ఎలా నిర్మించాలనే అవగాహన తనకు అప్పుడు లభించినట్లు ఆయన చెప్పుకునే వారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి సహా డీఎంకే తరఫున 13 మంది మాత్రమే గెలిచారు. 1962 ఎన్నికల్లో డీఎంకే 143 స్థానాల్లో పోటీచేయగా..వారందరినీ ఓడించడానికి కాంగ్రెస్‌ నేత కామరాజర్‌ వ్యూహరచన చేశారు. ఆ వ్యూహం నుంచి కరుణానిధి మాత్రమే తప్పించుకుని ఎన్నికల్లో గెలిచారు.
సడలని ధైర్యం ఆయన సొంతం
కరుణానిధి విజయాల వెనుక రాజకీయ చతురతతోపాటు మొక్కవోని ధైర్యం కూడా ఉంది. ఎమర్జెన్సీ కాలంలో స్టాలిన్‌, మురసొలి మారన్‌లను జైలులో పెట్టినా తన పోరాటాన్ని మాత్రం కరుణానిధి ఆపలేదు. అప్పట్లో ఆయన్ను  పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచే ఉత్కంఠ పరిస్థితుల్లో ఓ విలేకరి ‘ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే రాయండి’ అంటూ ఓ కాగితం ముక్కను ఆయనకు ఇవ్వగా..‘అన్యాయం పతనమవుతోంది... ధర్మం జయిస్తుంది’ అంటూ రాశారు. వీధి పక్కనే నివసించిన అరుదైన నేతల్లో కరుణానిధి ఒకరు. అలాంటి ఇళ్లలో ఉండటం ప్రముఖులకు సురక్షితం కాదని పలువురు చెప్పినప్పటికీ వాటిని ఆయన ఖాతరు చేయలేదు.
ఆదివారమూ.. పనివారమే
కరుణానిధి అధికారంలో ఉంటే ఆదివారం కూడా సచివాలయానికి వెళ్లే వారు. అందుకే పలువురు ఉన్నతాధికారులూ ఆదివారం సచివాలయానికి చేరుకునేవారు. 1999లో పుళల్‌ జలాశయం గట్టు తెగే పరిస్థితి ఉన్నట్టు అప్పటి సీఎం కరుణానిధికి సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులను సచివాలయానికి రమ్మని కబురు పెట్టి ఆయనా బయలుదేరారు. దీని గురించి అప్పట్లో  ఓ ఆంగ్ల దినపత్రిక ‘వేకువజామున కరుణానిధి సచివాలయానికి వెళ్లగా లిఫ్ట్‌ ఆపరేటరు లేడు.లిఫ్టూ కింది అంతస్తులో లేదు. వెంటనే ముఖ్యమంత్రి మెట్ల దారిన తన ఛాంబర్‌కు వెళ్లారు. తొందరలో ముఖ్యమంత్రి కాళ్లు రెండేసి మెట్లను దాటాయి’ అంటూ వార్త ప్రచురించింది. ఇది ఆయన పని సంస్కృతికి.. నిబద్ధతకు నిదర్శనమే.
వ్యూహ ప్రతివ్యూహ చతురుడు
దేశ స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనను దగ్గరి నుంచి చూసిన నేతగా కరుణానిధి జాతీయ ఖ్యాతి గడించారు. కాంగ్రెస్‌తో జతకట్టినా, భాజపాతో కలిసి నడిచినా పరిస్థితులకు అనుగుణంగా మంచి నిర్ణయమే తీసుకున్నారన్న అభిప్రాయాన్ని అటు ప్రజల్లో.. ఇటు కార్యకర్తల్లో కలిగించేవారు. అత్యవసర పరిస్థితుల్లో తొలుత కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండి తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజలను మెప్పించారు. అత్యయిక స్థితి.. అత్యంత నాటకీయత
1967 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. రెండేళ్లకే అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేసే డీఎంకే వైఖరిని మార్చుకుంది. ‘బంధానికి చేయి అందిద్దాం, హక్కు కోసం నినదిద్దాం’ అంటూ పంథా మార్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాల గురించి అధ్యయనం చేసేందుకు రాజమన్నార్‌ కమిటీని కరుణానిధి నియమించారు. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చి ఇందిర ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వానికి బయటి నుంచి  మద్దతిచ్చారు. 1971 ఎన్నికల్లో డీఎంకే, ఇందిరా కాంగ్రెస్‌ కూటమి గెలిచింది. అప్పట్లో డీఎంకే 183 స్థానాల్లో విజయం సాధించింది. కానీ రాష్ట్ర స్వయంప్రతిపత్తి గురించి కరుణానిధి గళం విప్పడం.. ఇందిరాగాంధీతో స్నేహానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది. అటు తర్వాత 356వ ఆర్టికల్‌ కింద కరుణానిధి ప్రభుత్వం రద్దయింది. దాంతో పాటు కరుణానిధి సహా పలువురిపై సర్కారియా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. అలా ఎమర్జెన్సీ సమయంలో డీఎంకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాతి ఎన్నికల్లో డీఎంకేకు వరుస పరాజయాలు ఎదురై ఎంజీఆర్‌ నాయకత్వంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్‌ మరణించే వరకు సీఎం పీఠం కరుణానిధికి కలగానే మిగిలింది. అయినా కరుణ బలమైన ప్రతిపక్ష నేత పాత్రను పోషించారు.
మళ్లీ ఇందిరకు.. స్నేహ హస్తం
ఎంజీఆర్‌పై పైచేయి సాధించడం కోసం అప్పట్లో కరుణానిధి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ చేదు అనుభవాలు సైతం దిగమింగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీతో కలిసి ఎన్నికల కూటమి ఏర్పాటు చేశారు. ‘నెహ్రూ కుమార్తెకు స్వాగతం, సుస్థిర పాలన అందించాలి’ అనే నినాదాన్ని వినిపించారు. ఆ ఎన్నికల్లో ఆ కూటమి ఘన విజయం సాధించడంతో.. ఎంజీఆర్‌పై కరుణానిధి చేపైయి సాధించారు. తర్వాతే సర్కారియా కమిషన్‌ నివేదిక ఆధారంగా కరుణానిధిపై పెట్టిన కేసులను కేంద్రం వెనక్కు తీసుకుంది. అనంతర శాసనసభ ఎన్నికల్లో కరుణ - ఇందిరల కూటమి పరాజయం పొందింది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య దోబూచులాట
1999లో భాజపాతో కరుణానిధి ఎన్నికల కూటమి ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఎన్నికల పరంగా ఆ ప్రయత్నం ఫలించినప్పటికీ సెక్యులర్‌ పార్టీగా పేరున్న డీఎంకే విమర్శలను ఎదుర్కొంది. ఐదేళ్లు భాజపాతో కలిసి ప్రయాణించిన డీఎంకే.. అటు తర్వాత కాంగ్రెస్‌ వైపు చేరి యూపీఏలో భాగస్వామిగా మారింది. 2006 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి గెలిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్‌, పీఎంకే, వామపక్షాల మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు. శ్రీలంకలో ఈళం తమిళుల ఊచకోతకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణమనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చేసింది.
-ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే- చెన్నై

2017-2018 లో ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ అనువర్తనాలు




పేరు
ప్రారంభించబడింది
వివరాలు
1.
IRA
హెచ్డిఎఫ్సి బ్యాంక్
ఒక మానవరూప రోబోట్
2.
వాయిస్ బయోమెట్రిక్స్ ప్రామాణీకరణ
సిటీబ్యాంకు

3.
మిషన్ ఫింఫిట్
లక్ష్మీ వికాస్ బ్యాంక్
ఆర్థిక ప్రణాళిక మరియు సంపద నిర్వహణ కోసం వేదిక
4.
CBOL (సిటీబ్యాంకు ఆన్లైన్)
సిటీబ్యాంకు
నిజ సమయ చాట్ సౌకర్యం
5.
తామ్రా (పారదర్శకత, వేలం పర్యవేక్షణ మరియు వనరుల ఆగ్నేమినేషన్)
గనుల మంత్రిత్వశాఖ
మైనింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి వెబ్ పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనం
6.
Pinakin
తమిళనాడు ప్రభుత్వం
ప్రపంచ వారసత్వ పర్యాటక స్థలాలను కలిగి ఉన్న ఒక అనువర్తనం
7.
ఆధార్ పే
IDFC బ్యాంక్
ఐడిఎఫ్సికి 1 వ బ్యాంక్ కలదు
బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ
8.
సౌర క్యాలిక్యులేటర్ అనువర్తనం
ఇస్రో
సోలార్ పలకలను ఇన్స్టాల్ చేయగల ప్రయోజనాలను లెక్కించేందుకు
9.
తరంగ్ సంచార్
DoT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం)
మొబైల్ టవర్స్లో సమాచార భాగస్వామ్యం కోసం వెబ్ పోర్టల్
10.
SPARROW- దాని (స్మార్ట్ ప్రదర్శన అప్రైసల్ నివేదిక రికార్డింగ్ ఆన్లైన్ విండో)
వాణిజ్య మంత్రిత్వ శాఖ
ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (ITS) అధికారులు వారి APAR ఆన్లైన్ ని పూరించడానికి వీలు కల్పించడానికి
11.
రైల్ సాత్తి
భారతీయ రైల్వేలు
ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి మొబైల్ అనువర్తనం
12.
ఇ-NWR (ఎలక్ట్రానిక్ వేర్హౌస్ రసీప్)
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ
పూర్తి ప్రాసెస్ని డిజిటైజ్ చేయడానికి వెబ్ పోర్టల్
13.
DARPAN (పబ్లిక్ మరియు నేషన్ రివీ కోసం డిజిటల్ అప్లికేషన్)
మణిపూర్ ప్రభుత్వం
రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి సామాజిక ఆడిటింగ్ కోసం
14.
ఆమె బాక్స్
మహిళల మంత్రిత్వశాఖ మరియు పిల్లల అభివృద్ధి
లైంగిక వేధింపులను నివారించడానికి మహిళలకు వెబ్ పోర్టల్ ప్రారంభించింది
15.
Diksha
మానవ వనరుల మంత్రిత్వ శాఖ
ఉపాధ్యాయులకు డిజిటల్ వేదిక అందించడానికి
16.
కిల్కారి అనువర్తనం
హర్యానా ప్రభుత్వం
గర్భిణీ స్త్రీలు, తల్లిదండ్రులు మరియు ఆరోగ్య కార్యకర్తల మధ్య అవగాహన కల్పించడం
17.
RailCloud
భారతీయ రైల్వేలు
క్లౌడ్ సర్వర్
18.
తేజ్
Google
UPI ఆధారిత చెల్లింపు సంచి
19.
దివాంగ్ సార్తి

విభిన్నంగా అభ్యసించే సమాచారం అందించడానికి మొబైల్ అనువర్తనం
20.
BPAY
Fino Payments App
మొబైల్ బ్యాంకింగ్ అనువర్తనం
21.
BATUAA
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
మొబైల్ వాలెట్
22.
Swayam
మానవ వనరుల మంత్రిత్వ శాఖ
విద్యార్థులకు అధ్యయనం చేసే పదార్థాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడానికి వెబ్ పోర్టల్
23.
ఒక ప్లానెట్ అకాడమీ (OPA)
కాప్జెమినితో కలిసి WWF-India
ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పోర్టల్
24.
మేరా iMobile
ICICI బ్యాంక్
గ్రామీణ వినియోగదారుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి మొబైల్ బ్యాంకింగ్ అనువర్తనం
25.
షాగన్ వెబ్ పోర్టల్
భారతదేశం యొక్క HRD మంత్రిత్వశాఖ సహకారంతో ప్రపంచ బ్యాంకు

26.
EVA (ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్)
హెచ్డిఎఫ్సి బ్యాంక్
కస్టమర్ సేవల కోసం AI ఆధారిత చాట్బోటో
27.
భద్ర App
కర్ణాటక ప్రభుత్వం
మహిళల భద్రత కోసం
28.
PMIS (ప్రాజెక్ట్ మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)
భారత జాతీయ రహదారి అథారిటీ
ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం మొబైల్ అనువర్తనం
29.
పెన్సిల్ (నో బాల కార్మికులకు ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం వేదిక)
కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ
బాల కార్మికులు వంటి నేరాల నుండి పిల్లలను నిరోధించేందుకు పోర్టల్
30.
myLoan
టాటా రాజధాని
రుణాల గురించి సమాచారం / వివరాలను తనిఖీ చేయడానికి మొబైల్ అనువర్తనం
31.
100MB
JetSynthesis
మొబైల్ అనువర్తనం
32.
UGC App
విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమీషన్ (UGC)
రగ్గింగ్ను నిరోధించడానికి ఒక అనువర్తనం
33.
ఇ-pashuhaat
వ్యవసాయ మంత్రిత్వశాఖ మరియు వ్యవసాయ సంక్షేమ శాఖ
పాల ఉత్పత్తిదారులతో పాలుపంచుకునే వెబ్ పోర్టల్
34.
Gamepind
PayTM సహకారంతో AGTech
చైనీస్ మొబైల్ గేమింగ్ వేదిక
35.
selfie
ఫెడరల్ బ్యాంక్
దాని వినియోగదారులు వారి పెట్టుబడులపై నియంత్రణను ఇచ్చే వేదిక
36.
Aarambh
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం మొబైల్ అనువర్తనం
37.
సాగర్ వాని
ESSO- ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)
జాలరుల భద్రత కోసం అనువర్తనం
38.
యుఎన్ఎంజి (నూతన-వయస్సు పాలన కోసం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్)
CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)
విమానాశ్రయాలలో ప్రయాణీకులకు లాస్ట్ మరియు కనిపించే అనువర్తనం
39.
మార్షల్ పర్యవేక్షణ బీట్
పూనే సిటీ పోలీస్
నగర పోలీస్ యొక్క నిజ సమయ స్థానాన్ని మ్యాప్ చేయడానికి మొబైల్ అనువర్తనం
40.
భారత్ కీ వీర్
హోమ్ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ
కేంద్ర పారామిలటరీ దళాల నుండి అమరవీరుల కుటుంబంలో పాలుపంచుకోవడానికి వెబ్ పోర్టల్ మరియు మొబైల్ అనువర్తనం
41.
ప్రయాణం నింజా
అపోలో మ్యూనిచ్
1 స్ట్రీట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ చాట్ బాట్
42.
హమ్రాజ్
ఇండియన్ ఆర్మీ
వారి వివరాలను ట్రాక్ చెయ్యడానికి భారతీయ సైన్యానికి అప్లికేషన్
43.
selfie
ఫెడరల్ బ్యాంకు
డైరెక్ట్ ట్రేడింగ్ కొరకు పోర్టల్
44.
Pratibimba
కర్ణాటక ప్రభుత్వం
ప్రభుత్వ పనితీరు మరియు విజయాలు ప్రదర్శించడానికి వెబ్ ఆధారిత పోర్టల్
45.
SEVA (సరల్ ఐంధన విటనన్ అప్లికేషన్)
కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)
బొగ్గు పంపిణీలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడానికి
46.
ఇ-రకమ్ (ఇ-రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి)
సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ (CRWC)
రైతులకు సమాచారం
47.
ఫార్మా జన సమన్ధన్
నాడా (నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ)
నిషిద్ధ పదార్ధాలను కలిగి ఉన్న ఔషధాల గురించి అథ్లెటిక్స్కు సమాచారం అందించడానికి
48.
e-Krishi Samvad
ఐసిఎఆర్
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అనుగుణంగా ఇంటర్ఫేస్
49.
'ఇండియా క్వాక్' & 'సాగర్ వాని'
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజి (NCS)
ఒక భూకంపం సంభవించిన తర్వాత స్వయంచాలకంగా సమాచారాన్ని పంపిణీ చేసే మొబైల్ అనువర్తనాలు
50.
Mahaswayam
మహారాష్ట్ర ప్రభుత్వం
ఉద్యోగార్ధులకు తీర్చడానికి వెబ్ పోర్టల్
51.
E-బిడ్డింగ్
విద్యుత్ మంత్రిత్వ శాఖ
దేశీయ బొగ్గు వాడకం కోసం వెబ్ పోర్టల్
52.
MUI
మారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా
సముద్ర అనుబంధాన్ని కనెక్ట్ చేయడానికి మొబైల్ అనువర్తనం
53.
MyAgriGuru
మహీంద్రా & మహీంద్ర
రైతులకు ఒక సలహా వేదిక
54.
MERIT (ఆదాయం మరియు పారదర్శకత యొక్క పునర్ యవ్వనము కొరకు ఎలెక్ట్రిసిటీ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్)
విద్యుత్ మంత్రిత్వ శాఖ
వెబ్ పోర్టల్
55.
సైబర్ సూరక్షిత్ భారత్
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (MeitY)
సైబర్ నేర గురించి అవగాహన వ్యాప్తి
56.
thenationspride.com
ముంబై విద్యార్ధి సాచి మునాట్
పారా స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించడానికి వెబ్సైట్
57.
ASH TRACK
విద్యుత్ మంత్రిత్వ శాఖ & పునరుద్ధరణ శక్తి
ఫ్లై యాష్ మంచి నిర్వహణ కోసం మొబైల్ అనువర్తనం
58.
INAM-Pro +
రోడ్ ట్రాన్స్పోర్ట్ & హైవేస్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
కలిసి సిమెంట్ కొనుగోలుదారులు మరియు విక్రేతలు తీసుకురావడానికి వేదిక
59.
అమ్మన్ అరన్ అనువర్తనం
తమిళనాడు ప్రభుత్వం
సమీప పోలీస్ స్టేషన్, ఆసుపత్రి మొదలైన వివరాల గురించి వినియోగదారులకు అందిస్తుంది.
60.
POSOCO-ఐఎండి
విద్యుత్ మంత్రిత్వ శాఖ
వాతావరణ పోర్టల్
61.
మేడ్వాచ్
భారత వైమానిక దళం
IAF వ్యక్తులకు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని అందించడానికి అనువర్తనం
62.
SMART OPD
mCURA
రోగులు సుదీర్ఘ వరుసలు దాటడానికి ఎనేబుల్ చెయ్యడానికి మొబైల్ అనువర్తనం
63.
వ్యతిరేక గ్రాఫ్ట్
యుపి ప్రభుత్వం
UP లో అవినీతిని నిరోధించేందుకు పోర్టల్
64.
బులెటిన్
Google
పొరుగు గురించి తక్షణ సమాచారం ప్రచురణ కోసం అనువర్తనం
65.
SkyRev 360
IATA (అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్) సహకారంతో AAI (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)
ఎయిర్క్రాఫ్ట్లలో ఉపయోగించిన వివిధ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ నుండి ఆటోమేటిక్ డేటా సేకరణను నిర్ధారించడానికి
66.
Empzilla

ఉద్యోగాలు కోసం శోధించడానికి చాట్ ఆధారిత అనువర్తనం
67.
Kadaknath
MP Govt
అరుదైన కోడి జాతికి మార్కెట్లోకి ప్రవేశించండి
68.
ఉద్మాయి మిత్రా
SIDBI
SME ల కోసం పోర్టల్ రుణాలు కోసం దరఖాస్తు చేసుకోవడం
69.
సుఖద్ యాత్ర
భారత జాతీయ రహదారుల అధికారం
వంటి లక్షణాలతో అనువర్తనం - వాస్తవ సమయ డేటా టోల్ ప్లాజాస్ వద్ద సమయం వేచి
70.
CASHe
టిఎల్సి పిటి లిమిటెడ్
భారతదేశం యొక్క 1 స్టాండ్ నగదు అనువర్తనం ఇవ్వడం
71.
బంధన్ టోడ్
బీహార్ ప్రభుత్వం; అనువర్తనం UNFPA యొక్క ఒక చొరవ (యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్)
అనారోగ్యంగల సాంఘిక అభ్యాసాల నుండి ప్రజలను సున్నితీకరించడానికి అనువర్తనం
72.
MySSB
సౌరాష్ట్ర సీమా బాల్
ఫోర్స్ పర్సనల్ యొక్క అవసరాలు మరియు సమాచారాన్ని తీర్చడానికి అనువర్తనం
73.
నాకు స్కౌట్
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF
ఫుట్బాల్లో భవిష్యత్ ప్రతిభను ప్రోత్సహించడానికి అనువర్తనం.
74.
అర్పనా (ఆధార్ నంబర్ ఆథెంటికేషన్ను ఉపయోగించి వ్యక్తిని పునర్విమర్శకు దరఖాస్తు చేయండి)
ఒడిషా ప్రభుత్వం
Odisha govt ఉద్యోగుల పెన్షన్ ఆన్లైన్ ప్రాసెసింగ్ కోసం పోర్టల్
75.
సిటిజెన్ సర్వీసెస్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
పోలీస్ ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవడానికి పౌరులకు అనువర్తనం
76.
ప్లూటో మార్పిడి
ప్లూటో ఎక్స్చేంజ్
అప్లికేషన్ క్రిప్టో కరెన్సీలు పరిష్కరించేందుకు
77.
PricePoint
Zippserv
రియల్ ఎస్టేట్ రిస్క్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్
78.
ఉద్యాం సఖి
సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ ఎంటర్ప్రైజెస్ (MSMEs) మంత్రిత్వశాఖ
మహిళా వ్యవస్థాపకులకు వెబ్ పోర్టల్


Related Posts Plugin for WordPress, Blogger...