2021 భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

 

           2021 సంవత్సరానికిగానూ..భౌతిక శాస్త్రం(Nobel Prize in Physics 2021)లో ముగ్గురిని నోబెల్‌ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో(Syukuro Manabe), క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ 05.10.2021 ప్రకటించింది.

 


  • సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై పరిశోధనలకు గానూ వీరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 
  • ఇందులో జార్జియో పారిసీ(Giorgio Parisi)కి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌(Klaus Hasselmann) పంచుకోనున్నారు. 
  • ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు.
  • డిసెంబరు 10 అందజేస్తారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...